ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు..
![ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు..](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64eb0f3e1b82e.jpg)
యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్): ఆలేరు శాసనసభ సభ్యురాలుగా మూడోసారి పోటీ చేసే అవకాశం లభించిన సందర్భంగా ఆదివారం నాడు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని తెలంగాణ ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాథ్. భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని నిలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. అనంతరం పుష్పగుచ్చం అందజేశారు. రానున్న ఎన్నికలలో మూడోసారి విజయకేతనం ఎగురవేసి మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరాటే బాలు. పాండవుల బసవయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.....