అప్పుల బాధతో  రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో  రైతు ఆత్మహత్య


మోత్కూర్(ముద్ర న్యూస్):మండలంలొని రాగిబావి గ్రామానికి చెందిన రైతు జినుకల ఐలయ్య (48 )అప్పుల బాధతో శుక్రవారం  తన పత్తి చేలోకి వెళ్లి పత్తి చేను కోసం తెచ్చిన (మొనో) పురుగుల మందులు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా ఐలయ్య మృతి చెందారు. ఐలయ్యకు భార్య పద్మ ,ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు .కాగా ఐలయ్య ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నారు. అప్పుల బాధకు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.