దత్తాయపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ గా కిషన్ యాదవ్ 

దత్తాయపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ గా కిషన్ యాదవ్ 

తుర్కపల్లి (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో గల పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన నాయకులు జిట్ట కిషన్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కిషన్ యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం పాలకవర్గ సభ్యులకు. పాడి రైతులకు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సహకార సంఘం బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు..