ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించిన గజ్వేల్ నేతలు

ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించిన గజ్వేల్ నేతలు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో చేపట్టిన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను గజ్వేల్ నేతలు పరిశీలించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి,గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా తదితరులు శుక్రవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని చౌరస్తా వద్ద చేపట్టిన బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. నాలుగు కోట్ల వ్యయంతో ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మిస్తున్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను గజ్వేల్ నేతలు ఆదేశించారు. త్వరలో గజ్వేల్ కు ప్రజ్ఞాపూర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నందున పనులను వేగవంతంగా నిర్వహించాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్ పాల్గొన్నారు