గ్యాదరి కమలమ్మకు రాష్ట్ర మంత్రుల, ఎమ్మెల్యేల నివాళులు

గ్యాదరి కమలమ్మకు రాష్ట్ర మంత్రుల, ఎమ్మెల్యేల నివాళులు

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:-సిద్దిపేటలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గ్యాదరి కమలమ్మ దశదినకర్మ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరై కమలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తల్లి  కమలమ్మ ఇటీవల మృతి చెందారు.ఆమె దశదిన కర్మ కార్యక్రమాన్ని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో బాలమల్లు కుటుంబీకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు ,జి జగదీశ్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్రఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గ్యాదరి కిషోర్, రసమయి బాలకిషన్, శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. గ్యాదరి  బాలమల్లును పరామర్శించారు. బాలమల్లుతో మాట్లాడి కమలమ్మ మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగిగా అందించిన సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.