యాదాద్రి ఆలయం ఒక అద్భుతం
![యాదాద్రి ఆలయం ఒక అద్భుతం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6516e6c4c6db8.jpg)
దత్త విజయానంద తీర్థ స్వామీజీ
యాదగిరిగుట్ట, ముద్ర: యాదాద్రి ఆలయం ఒక అద్భుతమని మైసూర్ దత్త పీఠం పరివ్రాజకచార్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ అన్నారు. శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండ కింద గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో చాతుర్మాస్య దీక్ష ముగించుకుని, భగవద్గీతలోని పదకొండవ అధ్యాయం పారాయణం చేసి తాను లోకకళ్యాణార్థమై విశ్వరూప విజయ యాత్రను ఈ దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు.
స్వామీజీకి ఆలయ మర్యాదలతో , పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అనుగ్రహాభాషణం చేస్తూ ఆలయం శిల్ప సౌందర్యంతో అద్భుతంగా ఉన్నదని, చాలా తక్కువ సమయంలో ఇలాంటి నిర్మాణం చేసినందుకు ప్రభుత్వానికి , అహర్నిశలు కష్టపడ్డ ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. తరువాత శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.