యాదాద్రి ఆలయం ఒక అద్భుతం

యాదాద్రి ఆలయం ఒక అద్భుతం

దత్త విజయానంద తీర్థ స్వామీజీ
యాదగిరిగుట్ట, ముద్ర: యాదాద్రి ఆలయం ఒక అద్భుతమని మైసూర్ దత్త పీఠం పరివ్రాజకచార్య  శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ అన్నారు. శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ కొండ కింద గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో   చాతుర్మాస్య దీక్ష ముగించుకుని, భగవద్గీతలోని   పదకొండవ అధ్యాయం పారాయణం చేసి తాను లోకకళ్యాణార్థమై విశ్వరూప విజయ యాత్రను ఈ దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు.

స్వామీజీకి  ఆలయ మర్యాదలతో , పూర్ణకుంభ స్వాగతం పలికారు.  అనంతరం అనుగ్రహాభాషణం చేస్తూ ఆలయం  శిల్ప సౌందర్యంతో అద్భుతంగా ఉన్నదని, చాలా తక్కువ సమయంలో  ఇలాంటి  నిర్మాణం చేసినందుకు  ప్రభుత్వానికి , అహర్నిశలు కష్టపడ్డ  ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. తరువాత శివాలయంలో   ప్రత్యేక పూజలు చేశారు.