గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టిన ఈవో, అధికారులు ,ఉద్యోగులు సంకల్పంతో ప్రారంభించాలని భక్తుల సూచన

గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టిన ఈవో, అధికారులు ,ఉద్యోగులు సంకల్పంతో ప్రారంభించాలని భక్తుల సూచన

 యాదగిరిగుట్ట జూన్ 24 (ముద్ర న్యూస్) యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రం లో ప్రతి శనివారం గిరిప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఈ సందర్భంగా గాలిగోపురం వద్ద నుండి కార్యక్రమాన్ని ప్రారంభించగా ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు గజవెల్లి రమేష్ బాబు, గట్టు శ్రవణ్ కుమార్ గుప్తా, వేముల వెంకటేశం ఇతర అధికారులు, ఉద్యోగులు భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న భక్తులకు మొదటగా శ్రీ స్వామివారి పాదాల వద్ద సంకల్పం చేయాలని ఈవో కు భక్రులు సూచించగా ఈఓ సానుకూలంగా స్పందించారు.