మోత్కూర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

మోత్కూర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
 మోత్కూర్ (ముద్ర న్యూస్) : మోత్కూర్ మండల, మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ ప్రజల క్షేమమే తన క్షేమమని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మి నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పని చేశానని మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. మోత్కూర్ మండలంలో 417 మంది బీసీ కులవృత్తుల వారు బీసీ బందుకు దరఖాస్తు చేసుకోగా మొదటి విడతగా 71 మందికి లక్ష రూపాయల సహాయం అందజేయనున్నామని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 1100 మంది దళితులకు దళిత బంధు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

మోత్కూర్ ప్రధాన రహదారులను బీటీ రోడ్లుగా మార్చడం కోసం టెండర్లు వేశామని త్వరలోనే మోత్కూర్ ప్రధాన రహదారులు బీటీ రోడ్లుగా మారుస్తామని అన్నారు. ప్రాజెక్టులు ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తిచేసి మోత్కూర్ పరిసర ప్రాంత ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తానని అన్నారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గోరుపెళ్లి శారద సంతోష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, ఎం