మాల సంఘ భవన నిర్మానా నికి రూ.5 లక్షల నిధులు మంజూరు..

మాల సంఘ భవన నిర్మానా నికి రూ.5 లక్షల నిధులు మంజూరు..

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో మాల సంఘం భవనం నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ లో గల తన పార్టీ కార్యాలయంలో ఆ గ్రామ మాల సంఘo నాయకులకు దానికి సంబంధించిన ప్రోసిడింగ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది విష్ణు, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.