దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు- జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి 

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు-  జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి 

ముద్ర ప్రతినిధి, భువనగిరి: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరంలో నిర్వహించే  ప్రజావాణి  కార్యక్రమాన్ని ఈనెల 5వ తేదీ రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి  జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి  నేడొక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 2వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు  రాష్ట్ర ప్రభుత్వం  నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం  నిమగ్నమై ఉండడం వలన తేదీ 5 న  ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని,   ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.