దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు- జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి
![దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు- జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647b154cb51ce.jpg)
ముద్ర ప్రతినిధి, భువనగిరి: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 5వ తేదీ రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి నేడొక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 2వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండడం వలన తేదీ 5 న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.