వర్షపు నీటిని జెసిబి సహాయంతో తొలగించిన మున్సిపల్ చైర్మన్..

వర్షపు నీటిని జెసిబి సహాయంతో తొలగించిన మున్సిపల్ చైర్మన్..

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మార్కండేయ నగర్ ప్రధాన వీధిలో గత కొంతకాలంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వలన నిలిచిన వర్షపు నీటిని బుధవారం నాడు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య జెసిబి సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎడతెరిపిలేని వర్షాల వలన ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్. జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్. బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి దయ్యాల సంపత్. నాయకులు జూకంటి వెంకటేష్. సరాబ్ సంతోష్ కుమార్. కుతాటి అంజన్ కుమార్. కాలనీవాసులు బేతి శ్రీను. యాదగిరి. మున్సిపల్ ఏఈ తో పాటు అధికారులు. సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.