గాంధీ జయంతి వేడుకలలో పాల్గొన్న ఉపేందర్ రెడ్డి..

గాంధీ జయంతి వేడుకలలో పాల్గొన్న ఉపేందర్ రెడ్డి..

ఆలేరు (ముద్ర న్యూస్): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని టిపిసిసి అధ్యక్షులు మరియు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాడు హైదరాబాదులోని గాంధీ భవన్లో నిర్వహించిన వేడుకలలో టిపిసిసి కార్యదర్శి మరియు ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగాం ఉపేందర్రెడ్డి మాజీ సీఎల్పి నాయకులు కోదండ రెడ్డి తో పాటు ముఖ్య నాయకులతో కలిసి పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. మహాత్మా గాంధీకి దేశంలో పెరుగుతున్న ఆదరాభిమానాలను. ఆప్యాయతను చూసి జీర్ణించుకోలేని మతోన్మాదులు ఆయనను హత్య చేశారని అన్నారు. నేడు గాడ్సే వారసులు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. గాడ్సే వారసులు మహాత్మ గాంధీ కలలను సాకారం చేస్తామని ప్రజలను మోసం చేయడానికి ఆయన తప్పు పడ్డారు. మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేసేందుకు రానున్న ఎన్నికలలో రాష్ట్ర వారసులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులతో పాటు అనుబంధ సంఘాల నాయకులు. తదితరులు పాల్గొన్నారు.....