ఆశీర్వాద సభను జయప్రదం చేయాలి.....

ఆశీర్వాద సభను జయప్రదం చేయాలి.....
  • మున్సిపల్ చైర్మన్ సుధా పిలుపు....

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో అక్టోబర్ 29న నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరి హాజరుకావాలని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ ప్రజలను కోరారు. శనివారం  యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లోని పలు కాలనీలో ఆమె బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికలలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇంచార్జి కసావు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మిట్ట వెంకటయ్య, పాపట్ల నరహరి, తాళ్లపల్లి నాగరాజు, ముక్కెర్ల సతీష్ యాదవ్, సయ్యద్ బాబా, కళ్లెం స్వాతి, వాసం రమేష్, గంగసాని నవీన్, దండబోయిన వీరేష్, ఎండి యాకూబ్, కొన్నే ప్రదీప్, థాకూర్ నవీన్, వార్డు అధ్యక్షులు హిరేకార్ లకాన్, గుండ్లపల్లి లింగం గౌడ్, బండి వాసు, పయ్యావుల శ్రీనివాస్, బుడికే సత్తయ్య, గడ్డమీది రాజాలు, మాటూరు వెంకటయ్య, రాజా మల్లయ్య పాల్గొన్నారు.