శ్రీధర్ బాబును గజమాలతో సన్మానించిన యాదవ సంఘం నేతలు

శ్రీధర్ బాబును గజమాలతో సన్మానించిన యాదవ సంఘం నేతలు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మాజీ మంత్రి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుదిళ్ల శ్రీధర్ బాబును ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న శ్రీధర్ బాబును రామగిరి మండలంలోని సెంటినరికాలనీ కి చెందిన యాదవ సంఘం నేతలు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసం యాదవ సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వల వెంకన్న యాదవ్, అల్వల తిరుపతి యాదవ్, ఆర్రే సదయ్య యాదవ్, బంక అంజయ యాదవ్, జంగం మల్లయ్య యాదవ్, మేకల ఓదెలు యాదవ్, బట్టి రాజయ్య యాదవ్, శీలం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.