పార్టీ లో చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోరు

పార్టీ లో చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోరు

వలిగొండ (ముద్ర న్యూస్) : వలిగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు రోజు రోజుకు పెరుగుతూ మంచి హుషారు మీద ఉన్నది. పార్టీలో పెద్ద ఎత్తున చేరిక లతో రోజు రోజుకు బలంగా తయారవుతుంది. ఆదివారం రోజున పైల్వాన్ పురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 20 మంది యువజన సభ్యులు భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్ పార్టీ లోకి చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో పుర్మ శరత్ బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పుర్మ శరత్, గుర్రం శేఖర్ రెడ్డి, పత్తేపు నరేష్, నవీన్, రజ్జు,చందం వంశీ, శ్యామల బాలారాజు, మాధ ధనుష్,శ్యామల ప్రవీణ్, గొర్ర గణేష్, పల్లె నవీన్,వళ్లమ్దాస్ విశ్వనాధ్,పుర్మ వంశీ, శ్యామల నగేష్, అరుణ్, చేగురి దుర్గా ప్రసాద్, వనగంటి అరవింద్ యాదవ్ లు పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ, ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.