16, 17వ వార్డులలో ప్రచారం చేసిన మన్విత రెడ్డి
![16, 17వ వార్డులలో ప్రచారం చేసిన మన్విత రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_6532695ac072e.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి :పట్టణంలోని 16వ వార్డు అర్బన్ కాలనీ, 17వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీ, గంజ్ మార్కెట్లో పైళ్ల శేఖర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని పైళ్ల మన్వితా రెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ శేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మా నాన్నని గెలిపించాలని కోరారు.
ఆమెకు ప్రజలు సాధారంగా అహనం పలికి తమ ఓటు కారు గుర్తుకేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వార్డు కౌన్సిలర్స్ కడారీ ఉమాదేవి వినోద్, చెన్న స్వాతి మహేష్, గాదె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, బి.అర్.ఎస్ టౌన్ అధ్యక్షులు ఏ వి కిరణ్, ప్రధానకార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, రాచమల్ల రమేష్, గోమారి సుధాకర్ రెడ్డి, పెంట నితీష్, నాగారం సూరజ్, నాకోటి నగేష్, ఇండ్ల శ్రీను, మోత్కుపల్లి శివ, అజయ్, బచ్చు శ్రవణ్, రాజేష్ పాల్గొన్నారు.