మా నాన్నను ఆశీర్వదించండి

మా నాన్నను ఆశీర్వదించండి
  • కడియం కావ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: అభివృద్ధికి మారు పేరైనా మా నాన్నను ఆశీర్వదించండని కడియం ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పల్లి కె ఆర్ గార్డెన్ లో శుక్రవారం పాస్టర్ల ఐక్య ప్రార్థన నియోజకవర్గస్థాయి సమావేశం పాస్టర్ బాలస్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....

దైవ జనులు అంటే నాకెంతో ఇష్టం నేను చదివింది క్రిస్టియన్ పాఠశాలలో అని గుర్తు చేశారు.  సమాజం మార్పు కోసం పనిచేసే పాస్టర్లు కష్టపడి పని చేసే వారికి కష్టసుఖాలలో పాలుపంచుకున్న వారికే మీ మద్దతును ఇవ్వాలని అలాంటి నాయకుడు మా నాన్నను మరొక్కసారి గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టించాలని డాక్టర్ కడియం కావ్య కోరారు. కడియం శ్రీహరి 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నాడని ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా  నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశాడని అన్నారు. రాజకీయ జన్మనిచ్చిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే కడియం శ్రీహరి గెలిపించేందుకు కృషి చేయాలి అన్నారు. స్థానిక ఎంపీటీసీ బూర్ల లతా శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో క్రీస్తు దాసు, పాస్టర్ల మండల అధ్యక్షుడు కేసీ జాన్ బన్నీ, దేవవరం, తమ్మడపల్లి సర్పంచ్ అనిత బాబు,  భూర్ల రాజు, మాజీ జడ్పిటిసి రాజేష్ నాయక్, సర్పంచ్ కోతి రాములు, కడియం కావ్య యువజన నాయకులు వివిధ మండలాలకు చెందిన పాస్టర్లు పాల్గొన్నారు.