కొమురవెల్లిలో మల్లన్న.. జనగామలో పల్లన్న..
జనగామలో జోష్ నింపిన బిత్తిరి సత్తి
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామలో పోటీ చేస్తున్న అన్ని ప్రధాన పార్టీ అభ్యుర్థలకంటే ముందుగా ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి చివరి రోజు కూడా రోజు చివరగా ముగించారు. మంగళవారం జనగామ పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ప్రముఖ ఆర్టిస్, య్యాంకర్ బిత్తిరి సత్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సత్తి తనదైన శైలిలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను పాటల రూపంలో పాడుతూ.. కేసీఆర్ చేస్తున్న సంక్షేమాన్ని విరించారు. ‘కొమురవెల్లిలో మల్లన్న.. జనగామలో పల్లన్న’ అంటూ కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తూ జోష్ నింపారు. చివరి రోజు ప్రచారంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, బీఆర్ఎస్ సీనియర్ నేత బండా యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.