విజ్ఞాన్ ఐఐటి క్యాంపస్ విద్యార్థి  మరి కొండ గణేష్ కు అభినందనలు

విజ్ఞాన్ ఐఐటి క్యాంపస్ విద్యార్థి  మరి కొండ గణేష్ కు అభినందనలు

భువనగిరి అక్టోబర్ 01 (ముద్ర న్యూస్) 67వ జిల్లా స్థాయి పాఠశాలల క్రిడోత్సవాలలో జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ ఐఐటి క్యాంపస్ విద్యార్థి మరికొండ గణేష్ అథ్లెటిక్స్ అండర్ 14 విభాగంలో జిల్లా స్థాయి లో మొదటి స్థానం సాధించి జోనల్ ఉమ్మడి జిల్లా కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం విజ్ఞాన్ విద్యాసంస్థలు చైర్మన్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి, కరస్పాండెంట్ పగిడాల పురెందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం గణేష్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా  చైర్మన్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి మాట్లాడుతూ తమ క్యాంపస్ విద్యార్థి అథ్లెటిక్స్ లో రాణించడం సంతోషకరమని గత సంవత్సరం రాష్ట్ర స్థాయీ లో మెడల్స్  సాధించారని గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.