బుడగ జంగాలకు అన్ని విధాలుగా అండగా ఉంటా : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

బుడగ జంగాలకు అన్ని విధాలుగా అండగా ఉంటా : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : బుడగ జంగాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన బుడగ జంగాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బుడగ జంగాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. బుడగజంగాలు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బి.అర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డి, రాములు, చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు భగత్, సుధాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.