ఇళ్ల స్థలాల సమస్యలు,స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా

ఇళ్ల స్థలాల సమస్యలు,స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా

రాజాపేట ఆగస్టు 14 (ముద్ర న్యూస్):- రాజాపేట పట్టణ,  మండలం లో ఇండ్ల స్థలాలు స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు మాట్లాడుతూ ఇండ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.యాదగిరిగుట్ట నుండి రాజాపేట వెళ్లే రోడ్డు ధ్వంసం అవడం మూలంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు రహదారి పునర్నిర్మానం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గుట్ట రాజాపేట మెయిన్ రోడ్ లోని పొట్టి మర్రి వద్ద ఉన్న వాగు పైన వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజాపేట మండలంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలన్నింటిని పరిష్కారం చేయాలని ఆయన అన్నారు.పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ షేరి వెంకట్ రెడ్డికి సమర్పించారు.ఈ కార్యక్రమంలో కటికల రామచంద్రం రాధమ్మ డప్పు రాజు పెద్ద నరసయ్య కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.