భవన నిర్మాణ పనులకు అడ్డుపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

భవన నిర్మాణ పనులకు అడ్డుపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

యాదగిరి గుట్ట (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మర్రిగూడ  గ్రామంలో  ఎంఎన్ఆర్ఈజిఎస్ నుండి మంజూరు అయిన నిధులతో గ్రామంలోని సర్వే నెంబర్ 580లోని ప్రభుత్వ భూమిలో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు అడ్డుపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోని నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే మరియు జిల్లా ప్రజా పరిషత్ లో ప్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్. గ్రామ సర్పంచ్ గడ్డం యాదయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు......