కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్

కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్

భూదాన్ పోచంపల్లి, ముద్ర; ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు. ఈ సారి భువనగిరి ఖిల్లా పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డులోని సీతవానిగూడెంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కోఆర్డినేటర్ గునిగంటి రమేష్ గౌడ్, నాయకులు మచ్చ శేఖర్ ,సామల సుధాకర్ రెడ్డి, చింతకుంట్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.