యాదాద్రి భువనగిరి కలెక్టరేట్​ ముందు అంగన్​వాడీల వంటా వార్పు

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని మూడు రోజులు  రాష్ట్రవ్యాప్తంగా  సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోకెన్ సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడో రోజైన శుక్రవారం రోజున  జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు 36 గంటల ధర్నా నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ ముందు వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి పాండు, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రమాకుమారి, నాయకులు సునంద, పద్మ, సునీత, సరిత, షాహెద, వసంత, భాగ్యలక్ష్మి, కవిత, అరుణ, సఫియా, వసంత, రుక్మిణి, రాధిక, మంజు, మాధవి, విజయలక్ష్మి లతో పాటు 1300 మంది టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు.