యాదాద్రి జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాలు ..

యాదాద్రి జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాలు ..

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ కేంద్రాలు. నియోజకవర్గ కేంద్రాలు. జిల్లా కేంద్రంలో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కొమురయ్య చిత్రపటాలకు. కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పమేలా సత్పతి తో పాటు జిల్లా అధికారులు. డిసిపి కార్యాలయంలో డిసిపి తో పాటు పలువురు పోలీసు అధికారులు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. బిఎస్సి జిల్లా అధ్యక్షులు జహంగీర్. సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు. బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్రావు. ఆలేరు పట్టణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ వి ప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య. టిటిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ రేగు బాల్ నరసయ్య. బిజెపి నియోజకవర్గ కోఆర్డినేటర్ చిరిగే శ్రీనివాస్. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు. కురుమ సంఘం నాయకులు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు. తదితరులు పాల్గొన్నారు.