ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు: కుంభం

ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు: కుంభం

ముద్ర భువనగిరి భువనగిరి :తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తూ మార్పుని కోరుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని తాజ్ పూర్, హన్మాపురం గ్రామాల్లో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ధనిక రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరని కుటుంబపాలనని గద్దె దించే సమయం వచ్చిందని ప్రజలకి తెలియజేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు.అనంతరం తాజ్ పూర్  గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ సర్పంచ్, వార్డ్ మెంబర్ తో పాటు మరో 20 మంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు. హన్మాపురం గ్రామంలో వివిధ పార్టీల నుండి 40 మంది కాంగ్రెస్ లోకి చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యకమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.