తనయుడి కోసం తల్లి ప్రచారం..

తనయుడి కోసం తల్లి ప్రచారం..
  • నా కొడుకుని గెలిపించండి. అభివృద్ది చేస్తాడు..
  • సంజయ్ తల్లి సరోజమ్మా

మెట్‌పల్లి ముద్ర:-  నా కొడుకుని గెలిపించండి తండ్రిలా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి. మీ సమస్యల్లో తోడుగా ఉంటాడని బీ ఆర్ ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తల్లి కల్వకుంట్ల సరోజమ్మ పట్టణ ప్రజలను కోరారు.శుక్రవారం పట్టణంలోని 11వ వార్డులో తన తనయుడి కోసం ఆమే ప్రచారం నిర్వహించారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికై నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని. ఆయన వారసుడిగా ఎన్నికల బరిలో ఉన్న డాక్టర్ సంజయ్ ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాడని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు కోమిరెడ్డి జ్యోతి శ్రీనివాస్ రెడ్డి, ఒజ్జెల బుచ్చి రెడ్డి, మార్గం లక్ష్మి హనుమాన్లు, చర్లపల్లి లక్ష్మి రాజేశ్వర్ గౌడ్, నాయకులు లింగంపెళ్లి సంజీవ్, సారథి గౌడ్, అలీం, రాయల్ నాయక్ లు ఉన్నారు.