నాన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఎమ్మెల్యే కూతురు పైళ్ల మన్వితారెడ్డి
![నాన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఎమ్మెల్యే కూతురు పైళ్ల మన్వితారెడ్డి](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_653bb4f205136.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా నాన్నను భారీ మెజార్టీతో గెలిపించండని భువనగిరి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఆభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి కూతురు పైళ్ల మన్వితారెడ్డి ఓటర్లను కోరారు. శుక్రవారం పట్టణంలోని 21, 24, 28వ వార్డులలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులు శేఖర్ రెడ్డి హయాంలో జరిగాయని మరింత అభివృద్ధి చెందాలంటే పైళ్ల శేఖర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, కౌన్సిలర్ గొమారి సుధాకర్ రెడ్డి, నాయకులు గుండెబోయిన సురేష్ యాదవ్, హరికిషన్ గౌడ్, రహీం, నక్కల చిరంజీవి, కంచనపల్లి నర్సింగరావు, సాదు ఉమామహేశ్వర్, కొంచెం రామకృష్ణ, సహదేవ్, రత్నపురం పద్మ పాల్గొన్నారు.