నియోజకవర్గంలో రోడ్ల మరమ్మత్తు కోసం ఎమ్మెల్యే కృషి చేయకపోవడం బాధాకరం..

నియోజకవర్గంలో రోడ్ల మరమ్మత్తు కోసం ఎమ్మెల్యే కృషి చేయకపోవడం బాధాకరం..

బొమ్మలరామారం (ముద్ర న్యూస్): ఆలేరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు ఉన్న రోడ్లను మరమ్మత్తు చేయించడంలో రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా అనేకమంది ప్రమాదాలలో గాయపడి ఆర్థికంగా. శారీరకంగా నష్టపోయారని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని పకీర్ గూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి నుండి గ్రామం వరకు ఉన్న రోడ్డు గుంతలుగా ఏర్పడి ప్రయాణం చేయడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బొమ్మలరామారం మండలం తో పాటు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. కేవలం సంక్షేమ పథకాల వల్లనే అభివృద్ధి చెందిందనుకోవడం సరైనది కాదని ఈ సందర్భంగా ఆయన గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. గ్రామ ప్రజలు. తదితరులు పాల్గొన్నారు....