గొంగిడి గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం.. ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య..

గొంగిడి గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం.. ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య..

ఆలేరు (ముద్ర న్యూస్): ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించడం ద్వారానే ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో ఆయన బిఆర్ఎస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ గా పదవులు చేపట్టి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించడం ద్వారా రాష్ట్ర మంత్రిగా సునీత మహేందర్ రెడ్డి కి అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలుగల హరికృష్ణ. దార నవీన్ కుమార్. వస్పరి రవికుమార్. ప్రదీప్. విశాల్. కుశాల్. భాస్కర్. నరసింహారెడ్డి. ఉప్పల్. హనుమాన్. కర్ణాకర్. శ్రీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.....