యువ న్యాయవాదులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

యువ న్యాయవాదులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాలభాస్కర్ రావు

 భువనగిరి ముద్ర ప్రతినిధి : యువ న్యాయవాదులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాలభాస్కర్ రావు అన్నారు. శుక్రవారం స్థానిక వివేరా హోటల్ లో ఐ ఎల్ పి ఏ  యాదాద్రి భువనగిరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో యువ న్యాయవాదులకు వివిద చట్టాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన  ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం తమను తాము అప్డేట్ చేసుకోవాలన్నారు. అందుకు ఇలాంటి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని కాబట్టి న్యాయవాదులు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  శిక్షణా శిభిరం రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు.  భువనగిరి, ఆలేరు,  చౌటుప్పల్, రామన్నపేట బార్ అసోసియేషన్స్ కు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే. మురళి మోహన్ రావు మాట్లాడుతూ న్యాయవాదులు ఎంత సుశిక్షుతులైతే న్యాయవ్యవస్థ అంతగా మెరుగ్గా న్యాయాన్ని అందించగలదన్నారు. భువనగిరి ప్రిన్సిపల్  జూనియర్ సివిల్ జడ్జ్ డి. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా శిభిరాలు అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె. సునీల్ గౌడ్ మాట్లాడుతూ మొదటి తరం న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడానికి ఇలాంటి శిక్షణా శిభిరాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లెల సౌజన్య, భువనగిరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగారం అంజయ్య, భువనగిరి బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జి. వెంకటేశ్వర్లు, ఐ ఎల్ పి ఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం విజయదేవరాజు గౌడ్ అథిదులుగా విచ్చేసి న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గజ్జల వెంకట్రెడ్డి, అడ్వకేట్స్ సిద్ధిరాములు, సామ్సన్, గాంగేయుడు, లక్మీదేవి, సురేష్ కుమార్, మల్లేష్,  భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.