ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వస్తాం

ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వస్తాం
  • కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, ముద్ర;కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల పథకాలతో  అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ఆయా వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు  కుంభం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించి నిరంతరం ప్రజలందరికి అందుబాటులో ఉంటున్నానని, స్థానిక సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్నానని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సాధించలేదని ,అన్ని రంగాల్లో భువనగిరి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ప్రజలకి గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని రానున్న రోజుల్లో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్, జిల్లా కిసాన్ సేల్ ఆధ్యక్షుడు మర్రి నర్సింహారెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు భారత లవ కుమార్, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా కోఆర్డినేటర్ గునిగంటీ రమేష్ గౌడ్, కౌన్సిలర్లు మోటే రజిత రాజు, భోగ భానుమతి విష్ణు,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గునిగంటి వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుక్క కుమార్,బైరు రామాంజనేయులు,మెరుగు శశికళ ,గ్యార సందీప్, జింకల కుమార్, జింకల సూర్య తదితరులు పాల్గొన్నారు.