జిల్లా పరిషత్ కార్యాలయంలో జిపిఎఫ్  విభాగం ఏర్పాటు చేయాలి

జిల్లా పరిషత్ కార్యాలయంలో జిపిఎఫ్  విభాగం ఏర్పాటు చేయాలి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ జిపిఎఫ్ విభాగము ఏర్పాటు చేయాలని పిఆర్ టియుఎస్ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావులు  జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రామానుజాచార్యకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విడిపడి ఏర్పడిన జగిత్యాల జిల్లా యందు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిపిఎఫ్  విభాగము లేకపోవడం వలన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నందున, జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పి జిపిఎఫ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అలాగే కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయుల జిపిఎఫ్  అకౌంట్స్ లెడ్జర్ లను తెప్పించి, జిపిఎఫ్  పార్ట్ ఫైనల్స్, లోన్లు, ఫైనల్ పేమెంట్స్ కు సంబంధించిన అన్ని అప్లికేషన్లను జగిత్యాల జిల్లాలోనే తీసుకోవాలని సిఇఓను  కోరారు. సానుకూలంగా స్పందిచిన జిల్లా పరిషత్ సిఇఓ  రామానుజాచార్య  వీలైనంత త్వరగా జిపిఎఫ్  విభాగాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు  తెలిపారు.