మున్సిపల్ కమిషనర్ ద్వంద వైకరి విడాలి

మున్సిపల్ కమిషనర్ ద్వంద వైకరి విడాలి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టి ప్లెక్షిలు తొలగింపులో ద్వంద వైకరి విడాలని మాజీ ముసిపల్ అధ్యక్షలు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మిలు అన్నారు. వారు మాట్లడుతూ జగిత్యాల పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన సందర్బంగా కాంగ్రెస్ పార్టి కట్టిన ఫ్లెక్సిలను తొలగించడం బాధకరం అన్నారు. మున్సిపల్ కమిషనర్ గా  బాధ్యతులు స్వీకరించిన రోజు నుండి అమలు చెస్తె ఇంక బాగుండేదని  ఇప్పటికైన మీ  బాద్యతను గుర్తెరిగి మా కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లోక్సిలను తొలగించరాని ఎద్దేవా చేశారు.  

రానున్న రోజులలో ఏపార్టీలైన కాని కార్యక్రమం అనంతరం వెనువెంటనే తొలగించి కమిషనర్  నిబద్దతను నిరుపెంచుకోవాలని చేశారు. ఒక్క వేలా ప్లెక్షిలు తొలగించనట్లు అయితే ఎమ్మెల్యే ఇంటి ముందు, మున్సిపాలటి అఫిస్ ముందు పెద్దయేత్తున కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయవలసివస్తుందని హెచ్చరించారు. ఈ సందర్బంగా హత్ సే హత్ జోడో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కల్లేపల్లి దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు గాజుల రాజేందర్, అల్లాల రమేశ్ విజయ్, గుండ మధు, లైశెట్టి విజయ్ కార్యకర్తలు పాల్గొన్నారు.