హైకోర్టు జడ్జ్ గా అర్హత సాధించిన భవిష్య కు సన్మానం

హైకోర్టు జడ్జ్ గా అర్హత సాధించిన భవిష్య కు సన్మానం

ముద్ర, మల్యాల: వీర్లపల్లి మండలంకు చెందిన జోగినిపెల్లి అర్పితరాజేశ్వర్ రావుల కుమార్తె భవిష్య హైకోర్టు లో జూనియర్ జడ్జ్ గా అర్హత సాధించడంతో గురువారం పలువురు సత్కరించారు. రాజేశ్వర్ రావు అత్తగారి గ్రామం మండలంలోని మద్దుట్ల కావడంతో శ్రీరామ నవమి వేడుకలకు వచ్చిన భవిష్యను స్థానిక సింగిల్ విండో అధ్యక్షుడు బోయిన్ పల్లి మధుసూదన్ రావు, బీఆర్ఎస్ నాయకులు అరుణ్ రావు, తదితరులు సన్మానించారు.

2022 TS రాష్ట్ర హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షలో ఉత్తిర్ణతసాధించిన 25 ఏళ్ల భవిష్య, మౌకిక పరీక్షలో కూడా అర్హత పొంది రాష్ట్ర హైకోర్టు జూనియర్ జడ్జ్ గా ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోతాని రవి , ప్యాక్స్ డైరెక్టర్లు అరుణ్ రావు , మల్లారెడ్డి     బీఆర్ఎస్ నాయకులు పొన్నం శ్రీను,సత్యంరావు, కూసరి ప్రభాకర్, తోట రవి, సుమన్, చేతన్, గ్రామస్తులు పాల్గొన్నారు.