ఆలయాల్లో ఏకాదశి పూజలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ఆలయాల్లో ఏకాదశి పూజలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించిన వేళ జరుపుకునే తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని మడేలేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురసి పంటలు బాగా పండాలని కోరారు. అనంతరం 19వ వార్డులో సీసీ రోడ్లుతో పాటు పలు అభివృద్ది పనులను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు పంబాల రామ్ కుమార్, ముస్కు నారాయణ రెడ్డి, క్యాదాసు నవీన్, కూతురు రాజేష్, చుక్క నవీన్, బోడ్లా జగదీష్, శివ కేసరి బాబు, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, రంగు మహేష్, రామకృష్ణ, బండారి రాజ్ కుమార్, కూతురు శేకర్, రాజన్న, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ అలిశెట్టి వేణు, పట్టణ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ రావు, డిఇ  రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.