నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పి.డి.యాక్ట్ కేసులు
- నకిలీ విత్తనాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ పోర్స్
- జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించిన, తాయారు చేసినవారిఫై పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడ అయిన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పి ప్రజలకు, రైతులకు సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్నందున రైతులు నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకొరకు జిల్లా పోలీసులు సిద్ధంగా ఉందని, నకిలీ విత్తనాల సరఫరా ,ఉత్పత్తి, అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే టాస్క్ఫోర్స్ ఫోన్ నంబర్ లకు లేదా స్థానిక పోలీసులకుగాని సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, పారితోషకాలను అందిస్తామన్నారు. అలాగే రైతులు విత్తనాలను వ్యవసాయ శాఖ నిర్దేశించిన దుకాణాల్లో మాత్రమే గోనుగోలు చేస్తే బాగుంటుందని, జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా,అమ్మకాలు జరిపితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పి.డి.యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. రైతులు టాస్క్ పోర్స్ అధికారులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు 8712656807, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు 8712656810, సిసిఎస్ ఎస్.ఐ సధాకర్ 8712573691 .