కొప్పుల ఈశ్వర్ గెలవాలని కోటేశ్వరస్వామికి ముడుపులు..

కొప్పుల ఈశ్వర్ గెలవాలని కోటేశ్వరస్వామికి ముడుపులు..

వెల్గటూర్, ముద్ర : ధర్మపురి నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన  కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం వెల్లటూరు మండలంలోని కోటిలింగాలలో గల కోటేశ్వర స్వామికి ముడుపులు కట్టారు. అంతకుముందు వారందరూ మండలంలోని రాజారాంపల్లి, అంబారిపేట రాజక్కపల్లి, వెల్గటూర్ గ్రామాల మీదుగా  కోటిలింగాల వరకు  పాదయాత్ర నిర్వహించారు.  కొందరు యువకులు వెల్గటూర్ నుంచి బైకుల పై ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు,  నాయకులతో కోటిలింగాల ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చల్లూరి రాంచందర్ గౌడ్, జూపాక కుమార్,  నాయకులు పత్తిపాక వెంకటేష్, గండ్ర విష్ణువర్ధన్ రావు, నర్సింగరావు, రామ్మోహన్ రావు, రంగు తిరుపతి గౌడ్, పెద్దూరి భరత్, కొప్పుల సురేష్, బిడారి తిరుపతి, యాగండ్ల తిరుపతి, వివిధ యూత్ సభ్యులు పాల్గొన్నారు.