నిర్దేశిత లక్ష్యాల మేరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ యాష్మీన్ బాషా 

నిర్దేశిత లక్ష్యాల మేరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ యాష్మీన్ బాషా 
District Collector Ashmeen Basha

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల సహకరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ బాషా అన్నారు. డిసెంబర్ 2022 కు సంబంధించిన త్రైమాసిక సమీక్ష లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు తక్షణం రుణ సదుపాయం తక్షణమే అందించాలని ఆదేశించారు. జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలు డిసెంబర్ 31 నాటికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ శుక్రవారం సంబంధిత బ్యాంకు అధికారులు, సంబంధిత ఏజెన్సీ సంస్థలతో డిసిసి, డీఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పట్ల బ్యాంకర్లు అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు.  

జిల్లా వ్యవసాయ రుణాలకు సంబంధించి  1176 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు 732 కోట్లు మంజూరు చేస్తూ, వార్షిక రుణ ప్రణాళిక కింద మొత్తం 2320 కోట్ల రుణాల్ని మంజూరు చేశామని వివరించారు. అలాగే వీధి వ్యాపారులకు సంబంధించి రెండవ విడతలో 4710 మందికి రుణాలు, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా రుణాల కింద 217 కోట్లు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 195 మందికి, జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్వశక్తి సంఘాలకు 376 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు 37. 5 కోట్లు అందించామని తెలిపారు. జిల్లాలో ప్రైవేటు బ్యాంకులు కొన్ని స్కీం లలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకర్లు స్టాండప్ ఇండియా స్కీం, డైరీ ఫార్మ్, ఫిషరీస్ పశుసంవర్ధక పథకాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ పొన్న వెంకటరెడ్డి, ఆర్బీఐ ఎల్. డి. ఓ. అనిల్ కుమార్, నాబార్డ్ డిడిఎం మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ వంశీ కృష్ణ, ఎస్బిఐ రీజినల్ మేనేజర్ ఫణి శ్రీనివాసులు, ఎఫ్ ఎల్ సీ. కోట మధు సూదన్ తో పాటు వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు