ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా టాపర్లను సన్మానించిన కలెక్టర్

ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా టాపర్లను సన్మానించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో టాపర్లగా నిలిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా శాలువాలతో సన్మానించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి మార్కులు పొందడాన్ని ఒక మంచి శుభ పరిణామమని, మంచి కళాశాలలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్  సూచించారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇబ్రహీంపట్నం నుండి  MPC-II లో  రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంక్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల జగిత్యాల నుండి J. మాధురి HEC-II గ్రూప్ లో  రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించింది. అలాగే ప్రథమ సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇబ్రహీంపట్నం నుండి MPC-I గ్రూపులో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది.  కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ, ప్రిన్సిపాల్ ఏ. సంజీవ్  పాల్గొన్నారు.