చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

పెద్ద శంకరంపేట, ముద్ర: పెద్దశంకరంపేట మండల పరిధిలోని సంగారెడ్డి పేట గ్రామానికి చెందిన లోక సాయి బాబా (32) గ్రామ శివారులో గల చెరువులో శవమై కనిపించాడు. పేట ఎస్సై బాలరాజు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానికుల సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు.  బార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న చేపల వేటకు వెళ్ళి యువకుడు మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు.