దళితులను దగా చేసేందుకే దళిత బంధు.. 

దళితులను దగా చేసేందుకే దళిత బంధు.. 
PCC member Kadempalli Srinivas

మూడెకరాల భూ పంపిణీ ముచ్చటేటు పాయే..
దళితులను మరోమారు దగా చేసేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని పీసీసీ సభ్యులు కడెంపల్లి శ్రీనివాస్ అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కేశంపేట మండలంలోని కొత్తపేట, ముదార్ పూర్ గ్రామాల్లో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భరత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని అదే స్ఫూర్తితో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలు చేయి చేయి కలిపి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ముందుకేస్తున్నారు. అనంతరం ఇల్లు లేని నిరుపేద మహిళ నిర్దవెల్లి జంగమ్మకు తన సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు అని గొప్పలకు పోతున్న కేసీఆర్ ప్రభుత్వం ఒక ఊరిలో కనీసం 10 మందికి మూడెకరాల భూమి, 10 మందికి దళిత బందు అమలు చేశారా అని ప్రశ్నించారు. అరకొరగా ఇచ్చి దళితుల ఓట్లతో గద్దెకెక్కి ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి కుటుంబ పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు ప్రజలు ఏకమై కేసీఆర్ గద్దె దించేందుకు కాంగ్రెస్తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.