షాద్ నగర్ లో వీర సైనికులకు నివాళులు

షాద్ నగర్ లో వీర సైనికులకు నివాళులు
Tributes to brave soldiers in Shad Nagar

 పట్టణంలో ర్యాలీ కొవ్వత్తులతో నివాళి..

షాద్ నగర్, ముద్ర: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వమాలో 14 ఫిబ్రవరి 2019న జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు షాద్ నగర్ పట్టణంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ టాలెంట్ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ముఖ్య కూడలిలో వీర జవాన్ల చిత్రపటాల వద్ద కొవ్వత్తులతో నివాళులర్పించారు.

ప్రపంచ దేశాలు ఏకమై ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అంతమందించాలని ఆకాంక్షించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని వీర జవాన్ల కుటుంబాలను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వాతి రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.