ఇంద్రానగర్ కాలనీలో బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ముద్ర, షాద్ నగర్: షాద్ నగర్ పట్టణం ఇంద్రానగర్ కాలనీలో బస్తీ దవాఖాన (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల వైద్య సౌకర్యాలను కల్పించిందని అన్నారు.
పేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం కావడంతో ఇంద్రానగర్ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందన్నారు. స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చిన బస్తీ దవాఖానాల్లో వైద్య సదుపాయాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.