మెప్మా ఆర్పీలకు వేతనాలు పెంచాలని కోరుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి వినతిపత్రం

మెప్మా ఆర్పీలకు వేతనాలు పెంచాలని కోరుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి వినతిపత్రం
Padmadevender Reddy

ముద్ర ప్రతినిధి, మెదక్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లో పని చేసే ఆర్పీలకు వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల భార్యలైన పాత ఆర్పీలను యధావిధిగా కొనసాగించాలని,  వేతనాలు రూ.18 వేల వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

నెలనెల వేతనాలు చెల్లించాలని, డ్రెస్ కోడ్, ఐడి కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన వారిలో అధ్యక్షురాలు బుచ్చమ్మ, కార్యదర్శి మాధవి, కోశాదికారి స్వప్న, ప్రతినిధులు యాదమ్మ, జ్యోతి తదితరులున్నారు.