ఎన్టీఆర్ కు నివాళులు...

ఎన్టీఆర్ కు నివాళులు...

పండ్లు పంపిణీ చేసిన నాయకులు
 మెదక్, ముద్ర ప్రతినిధి: నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి  సందర్భంగా మెదక్ మండలం మాచవరం గ్రామంలో  మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ,దుబ్బాక ఇంచార్జి ఇళ్లేందుల రమేష్ గారు, రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి,మెదక్ నియోజకవర్గ ఇంచార్జి ఏ.కే గంగాధర్ రావు  ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .తదనంతరం  గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

వెండితెర ఇలవేల్పు 9 నెలలో పార్టీ పెట్టి అధికారంలోకి తెచ్చి పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహనీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో  తెదేపా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆఫ్జాల్, ,నాయకులు రమేష్ చందర్,లక్ష్మణ్ యాదవ్,కరీం,అల్లుడు విష్ణు, వెంకటరావు,కరుణాకర్,దుర్గాప్రసాద్,వడ్ల వెంకటేశం,లచ్చయ్య, బెల్లవారం ప్రసాదరావు,నాగేశ్వరరావు, దాసరి సురేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.