డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయుడు దేవయ్య

డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయుడు దేవయ్య

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన  ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవయ్య ఉస్మానియ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను అందుకున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఆడోబ్ సి.ఈ. ఓ.పద్మశ్రీ శంతను నారాయణ్ చేతులమీదుగా డాక్టరేట్ ను స్వీకరించారు. ఈయన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై మెదక్ జిల్లాలో పరిశోధనలు చేశారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొడిచన్ పల్లిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతాపరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.