మందలించారని ట్రైన్ కు ఎదురెల్లి యువకుడు సూసైడ్

మందలించారని ట్రైన్ కు ఎదురెల్లి యువకుడు సూసైడ్

తూప్రాన్, ముద్ర: తల్లిదండ్రులు మందలించారని యువకుడు ట్రైన్ కి ఎదురెళ్లి సూసైడ్ చేసుకున్న సంఘటన మనోహరాబాద్ మండలం రామయిపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే హెడ్ కానిస్టేబుల్ జెష్పల్ సింగ్ కథనం ప్రకారం రామయిపల్లి గ్రామ సర్పంచ్ రావెల్లి పార్వతి మల్లేష్ దంపతుల కుమారుడు భాస్కర్(21) తన బాబాయ్ గత 15 రోజుల క్రితం హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడంతో అప్పటినుంచి భాస్కర్ రోజు మద్యం తాగుతుండడంతో ఆదివారం రాత్రి తల్లిదండ్రులు మందిలించారు.

మనస్థాపానికి గురైన భాస్కర్ పాలాట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కి ఎదురెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. కాగా భాస్కర్ డిగ్రీ మధ్యలో ఆపేసి గ్రామ శివారులో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే హాస్పిటల్ కి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జెష్పల్ సింగ్ తెలిపారు.