మెదక్ జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులుగా పూన రవీందర్

మెదక్ జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులుగా పూన రవీందర్

ప్రధాన కార్యదర్శిగా సుంకోజు దామోదర్ చారి

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం నాడు పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో నిర్వహించారు.  బుధవారం సాయంత్రం 4 గం.ల వరకు నామినేషన్ చివరిరోజు కావడంతో అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు కేవలం ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన పూన రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రామయంపేటకు చెందిన సుంకోజు దామోదర్లు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాయిసిరి ప్రకటించారు.

అనంతరం  రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరి రాఘవా చారి నూతన అధ్యక్ష, కార్యదర్శులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చేపూరి వెంకట స్వామి, పట్టణ అధ్యక్షులు చదువుల రమేష్, ప్రదాన కార్యదర్శి కృష్ణతో పాటు లక్షికాంతం చారి, బ్రహ్మచారి, ఉపేందర్ చారి, స్వర్ణకార సంఘం డెలిగేట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.