నగరికంటి జగన్ మృతి బాధాకరం - కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి
![నగరికంటి జగన్ మృతి బాధాకరం - కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64775585ac25c.jpg)
కోదాడ, ముద్ర: భారతీయ జనతా పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు నకరికంటి జగన్మోహన్ రావు ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించిందని భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో శ్రీనివాస్ నగర్ లో నకరికంటి జగన్మోహన్ రావు భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ జగన్ చిన్న వయస్సు లో కన్ను మూయడం కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ బొలిశెట్టి కృష్ణయ్య, బిజెపి రాష్ట్ర నాయకులు నూనె సులోచన , వంగవీటి శ్రీనివాసరావు , పందిరి ఫౌండేషన్ అధ్యక్షులు షేకు శ్రీనివాసరావు , బిజెపి ఆర్టిఐ జిల్లా ఇన్చార్జి రవి , మున్సిపల్ కౌన్సిలర్ తీపిర్శెట్టి సుశీల రాజు, తదితరులు ఉన్నారు.